calender_icon.png 11 September, 2025 | 3:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఈడీ బాంబు పేలి ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలు

11-09-2025 01:09:43 PM

హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలింపు

చర్ల, (విజయక్రాంతి):  చర్ల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని  దంతేవాడ  జిల్లా లో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరు సైనికులు మావోయిస్టులు అమర్చిన  ఐఈడీ  బాంబు దాడికి గురయ్యారు. బర్సూర్ ప్రాంతంలోని సత్ధర్, మాలేవాహి మధ్య జరిగిన సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఇద్దరు సిఆర్పిఎఫ్  జవాన్లు ఐ ఈ డి  దాడికి గురయ్యారు.  గాయపడిన సైనికులను దంతెవాడ జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నారు. దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ ఈ ఘటనను ధ్రువీకరించారు.