పెళ్లికి వెళ్తుండగా వాహనం బోల్తా.. ఇద్దరు మృతి
12-03-2026 12:46 PM
హైదరాబాద్: నిర్మల్ జిల్లాలో(Nirmal district) పెళ్లి ఇంట విషాదం నెలకొంది. పెళ్లి వాహనం బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. టైరు పేలి వాహనం బోల్తా పడి మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఇచ్చోడ మండలం సోన్ పల్లి నుంచి ఆర్మూర్ కు పెళ్లికి వెళ్తుండగా నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ బైపాస్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.




