30-07-2025 06:53:22 PM
ఎల్లారెడ్డిపేట (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) ఎల్లారెడ్డిపేట మండలంలో అనుమతికి విరుద్ధంగా ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ శ్రవణ్ కుమార్(Inspector Shravan Kumar) పట్టుకున్నారు. ఇసుక రవాణాకు బుధవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే రెవిన్యూ అధికారులు అనుమతి ఇవ్వగా.. అధికారుల అనుమతులను ఉల్లంఘించి మూడు గంటల వరకు ఇసుక రవాణా చేస్తున్నరెండు ట్రాక్టర్లను ఆర్ఐ శ్రవణ్ కుమార్ గుర్తించి రెవిన్యూ కార్యాలయానికి తరలించారు.