11 April, 2026 | 11:33 AM

Breaking News

కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •   జ్యోతిరావు పూలే జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ   •   కోదాడ జాతీయ రహదారిపై ఘోర బస్సుప్రమాదం... స్పాట్‌లో 36 మంది..!   •   బిక్కనూర్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం – ఇద్దరు మృతి   •   ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు   •   అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్‌... హైకోర్టు లాయర్‌ ఫామ్‌హౌస్‌ కూల్చివేత   •   జీవితంపై విరక్తి చెంది ఇద్దరు యువకుల ఇద్దరు ఆత్మహత్య   •   స్నేహితుల ఆపన్న హస్తం.. మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం   •   మిస్టరీగా మారిన గద్వాల విద్యార్థిని అదృశ్యం   •   యువతకు జిల్లాస్థాయి క్రీడా పోటీలు   •  

జీవితంపై విరక్తి చెంది ఇద్దరు యువకుల ఇద్దరు ఆత్మహత్య

11-04-2026 10:00 AM

దమ్మపేట,(విజయ క్రాంతి): మండల పరిధిలోని, తాటిమల్లప్పగుంపు గ్రామానికి చెందిన వాడే రాము (30) మద్యానికి బానిసై, వివాహం కూడా జరగకపోవడంతో జీవితం పై విరక్తి చెంది ఈ నెల 3 వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో మద్యంలో గుర్తు తెలియని విషం కలుపుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా వైద్యం నిమిత్తం ఖమ్మం తరలించి వైద్యం చేస్తుండగా గురువారం రాత్రి మరణించాడని మృతుని తండ్రి వాడే రాజులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ సాయి కిషోర్ రెడ్డి తెలిపారు.

మండల పరిధిలోని లచ్చాపురం గ్రామానికి చెందిన అల్లం సాయి ప్రసాద్   మద్యానికి బానిసై కూలీ పనులు చేయలేకపోవడంతో, తన జీవితంపై విరక్తి చెంది గురువారం మధ్యాహ్నం 12.00 గంటల సమయంలో గుర్తుతెలియని విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా ఖమ్మం  ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి 1.30 కు మరణించాడని మృతుని సోదరి గంపా వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ సాయి కిషోర్ రెడ్డి తెలిపారు.