31 May, 2026 | 6:46 PM

Breaking News

రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •   అది రైతు డిస్కం కాదు... రైతుల ప్రాణాలు తీసే 'బలిపీఠం'!   •   వరికొయ్యలు, పంట అవశేషాలను కాల్చొద్దు   •  

భారత్‌కు యూఏఈ అధ్యక్షుడు బిన్ జాయెద్

20-01-2026 01:46 AM

ఘనస్వాగతం పలికిన ప్రధాని మోదీ

ఒకే కారులో ఇరు దేశాధినేతల సవారీ

న్యూఢిల్లీ, జనవరి 19: భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆహ్వానం మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సోమవారం ఢిల్లీకి విచ్చేశారు. విమానాశ్రయానికి స్వయంగా మోదీ వెళ్లి ఆయనకు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ప్రధాని నివాసం వరకు వీరిద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. ఈ పర్యటన గురించి మోదీ సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ, తన సోదరుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇండియాకు విచ్చేయడం ఆనందాన్నిచ్చిందని కొనియాడారు. ఆయన పర్యటన భారత్ మైత్రి బంధానికి ప్రతీకకా నిలుస్తుందని అభివర్ణించారు. అనంతరం ఇద్దరు దేశాధినేతలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం ఉద్రిక్తలు నెలకొన్న వేళ వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్నది.