31 May, 2026 | 7:36 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

మరోసారి సీబీఐ ఎదుటకు విజయ్

20-01-2026 01:44 AM

కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణ

సుమారు ఆరు గంటల పాటు ప్రశ్నల వర్షం

న్యూఢిల్లీ, జనవరి 19: ‘కరూర్ కార్నర్ మీటింగ్‌కు ఎందుకు మీ రాక ఆలస్యమైంది? అంతపెద్ద ఎత్తున మీటింగ్ జనం వస్తే తొక్కిసలాట నివారణకు మీరేం చర్యలు తీసుకు న్నారు?’ అంటూ తమిళ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్‌ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్  (సీబీఐ) ప్రశ్నించించినట్లు తెలిసింది. కరూర్ తొక్కిసలాట కేసులో భాగంగా సోమవారం ఆయన రెండో సారి సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఉదయం చెన్నై నుంచి ప్రత్యేక ఫ్లెట్‌లో విజయ్ ఢిల్లీకి చేరుకున్నారు.

అనంతరం 10 గంటలకు నేరుగా సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. సీబీఐ అధికారులు ఆయన్ను సు మారు ఆరు గంటల పాటు విచారించింది. సాయంత్రం 5 గంటల తర్వాత విజయ్ కా ర్యాలయం నుంచి బయటకు వచ్చారు. ఈ కేసులో జనవరి ౧౨న మొదటి సారి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. మరోవైపు ఈకేసులో సీబీఐ వచ్చే నెలలో కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేస్తుందని సమాచారం.