17 March, 2026 | 1:24 PM

Breaking News

కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. ఢిల్లీకి ఎన్నిసార్లయినా వెళ్తాం   •   బడ్జెట్ అంచనాలు బోల్తా కొట్టాయి.. రివైజ్డ్ అంచనాలు రీచ్ కావట్లేదు   •   ఈ నెల 22 నుంచి రైతు భరోసా పంపిణీ.. అసెంబ్లీ సాక్షిగా ఆది శ్రీనివాస్ ప్రకటన   •   మియాపూర్‌లో రోడ్డుకు అడ్డంగా పడిన బస్సు.. 10 మందికి గాయాలు   •   8 నెలల క్రితం లవ్ మ్యారేజ్.. 4 నెలల గర్భిణి భార్యను చంపిన భర్త   •   కేసీఆర్ సంచలన నిర్ణయం.. పైలెట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు!   •   కూకట్‌పల్లిలో భారీ దారి దోపిడీ.. కళ్లలో కారం కొట్టి..   •   పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి   •   గవర్నర్ ప్రసంగం డొల్ల   •   ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి   •  

సేవాదళ్ పట్టణ అధ్యక్షులుగా ఉదయ్

16-04-2025 04:32 PM

మందమర్రి (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అనుబంధ సేవా దళ్ పట్టణ అధ్యక్షులుగా దోత్కు ఉదయ్ కుమార్ ను నియమిస్తూ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దల జితేందర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బుదవారం అందచేశారు. ఈ సందర్బంగా సేవాదళ్ పట్టణ అధ్యక్షులు ఉదయ్ మాట్లాడుతూ... చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు ఎండి హఫీజ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సొత్కు సుదర్శన్, మహిళ అధ్యక్షురాలు గడ్డం రజిని ఎస్సీ, సెల్ పట్టణ అధ్యక్షులు నేరువెట్ల, శ్రీను యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు మాయ తిరుపతి, మైనార్టీ నాయకులు చోటులు పాల్గొన్నారు.