18-07-2025 12:00:00 AM
ముంబై, జూలై 17: మహారాష్ట్ర సీఎం దేవేం ద్ర ఫడ్నవీస్ ను శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గురువారం కలిశారు. ప్రతిపక్షంలో ఉన్న ఉద్ధవ్ను పాలక పక్షంలోకి మారాలని అసెంబ్లీ వేదికగా సీఎం ఫడ్నవీస్ ఆహ్వానం తర్వాత ఈ సన్నివేశం చోటుచేసుకుంది. శాసనమండలి చైర్పర్సన్ గదిలో ఫడ్నవీస్, ఉద్ధవ్ స మావేశమయ్యా రు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి ని యామకం, త్రిభాషా విధానం అంశాలపై చర్చించారు. ఉద్ధవ్ ఠాక్రే ‘మనకు హిందీ ఎందుకు అవసరం?’ అనే పుస్తకాన్ని సీఎం ఫడ్నవీస్కు అందజేశారు.