20 March, 2026 | 10:37 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

భక్తిశ్రద్ధలతో ఉగాది పండుగ

20-03-2026 12:00 AM

శంకర్ పల్లి, మార్చి 19 (విజయక్రాంతి): శంకర్ పల్లి మండలంలోని గ్రామాలలో, మునిసిపల్ పరిధిలోని ప్రాంతాలలో గురువారం శ్రీ పరాభవ నామ ఉగాది పండుగలు ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. షడ్రుచులతో తయారుచేసిన పచ్చడి ని ఒకరినొకరు ఇచ్చుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఉదయం నుండే భక్తులు పలు దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పట్టణములోని శ్రీ గీత మందిరంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణాన్ని జోషి రాజు పంతులు పట్టణవాసులకు వినిపించారు. ఈ కార్యక్రమంలో 12 వ వార్డ్ కౌన్సిలర్ దండు రాజేశ్వర్, శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎం. ప్రకాష్ గుప్తా దిడిగే అనంతయ్య, మా శెట్టి పాండురంగ, దండు మోహన్, బచ్చు రామ్మోహన్, మా శెట్టి వెంకటేశం, మిరియాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.