20 March, 2026 | 11:16 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

ప్రియురాలి మృతి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న యువకుడు

07-01-2026 03:36 PM

యాచారం: ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడడంతో తీవ్రంగా కలత చెందిన యువకుడు తాను కూడా తనువు చాలించాడు. ఈ రెండు ఘటనలతో మండల వ్యాప్తంగా సంచలనంగా మారింది. మేడిపల్లి గ్రామానికి చెందిన పూజ (17) మహేష్ (20) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం యువతి కుటుంబీకులకు తెలిసి మందలించారు.  కొంతకాలంగా యువతి, మహేష్ ను దూరం పెట్టింది. 

దీనితోపాటు యువతికి పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో మహేష్, యువతికి ఫోను చేసి తాను లేకుండా ఉండలేనని తెగేసి చెప్పడంతో తీవ్రంగా కలత చెందిన  యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న యువకుడు బుధవారం హయత్ నగర్ మండల పరిధిలోని తొర్రూరు గ్రామంలోని ఒక వెంచర్ లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలతో మేడిపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. రెండు రోజుల వ్యవధిలో యువతి, యువకుడు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.