13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ప్రియురాలి మృతి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న యువకుడు

07-01-2026 03:36 PM

యాచారం: ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడడంతో తీవ్రంగా కలత చెందిన యువకుడు తాను కూడా తనువు చాలించాడు. ఈ రెండు ఘటనలతో మండల వ్యాప్తంగా సంచలనంగా మారింది. మేడిపల్లి గ్రామానికి చెందిన పూజ (17) మహేష్ (20) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం యువతి కుటుంబీకులకు తెలిసి మందలించారు.  కొంతకాలంగా యువతి, మహేష్ ను దూరం పెట్టింది. 

దీనితోపాటు యువతికి పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో మహేష్, యువతికి ఫోను చేసి తాను లేకుండా ఉండలేనని తెగేసి చెప్పడంతో తీవ్రంగా కలత చెందిన  యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న యువకుడు బుధవారం హయత్ నగర్ మండల పరిధిలోని తొర్రూరు గ్రామంలోని ఒక వెంచర్ లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలతో మేడిపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. రెండు రోజుల వ్యవధిలో యువతి, యువకుడు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.