10-02-2026 01:14:56 AM
జగిత్యాలలోని 26, 44, 48 వార్డుల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం
జగిత్యాల, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): కేంద్రంలో కొలువున్న బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం ముం దుండుగు వేస్తోందని జగిత్యాల బీజేపీ నేత కొండా లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపుకోసం, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, యువకులు మహిళలు తోడు రాగా బీజేపీ నేత కొండా లక్ష్మణ్ సోమవారం విస్తృత ప్రచారం నిర్వహించారు.
పట్టణంలోని 26,44,48 వార్డుల్లో బీజేపీ అభ్యర్థుల తరఫు న కొండా లక్ష్మణ్ ఇంటింటి ప్రచారం చేపట్టాగా ప్రజల్లో అపూర్వ స్పం దన లభించింది.ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్ మాట్లాడుతూ నరేంద్ర మో దీ నాయకత్వంలో దేశంఅభివృద్ధి పథంలో దుసుకుపోతుందన్నారు.
మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలని అందుకు బీజేపీ ని బలపర్చాలని కోరారు.పట్టణంలోని 50వార్డు లకు గాను 29 వార్డులు మహిళ లకు బీజేపీ టికెట్లు కేటాయించిందని లక్ష్మణ్ తెలిపారు.జగిత్యాలలోని అన్ని వార్డుల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించా లని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న నిధులు ద్వారానే అని గుర్తు చేశారు.