16 March, 2026 | 9:04 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

సంగెం మూసీ వంతెనపై గుర్తుతెలియని మృతదేహం లభ్యం

18-09-2025 05:21 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని సంగెం గ్రామం పరిధిలో గల మూసీ లోలెవెల్ వంతెనపై నుండి వెళ్తున్న వరద నీటి ప్రవాహంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమయింది. మృతదేహం హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి లేదా మూసీ పరివాహక ప్రాంతాల నుండి కొట్టుకొని వచ్చి ఉండవచ్చునని గ్రామస్తులు భావిస్తున్నారు. అయితే మృతదేహం సరిగ్గా మూసీ లోలెవెల్ వంతెన మధ్యలో మృతుడి ఒంటిపై బట్టలు లేకుండా కనిపించడంతో అటువైపు వచ్చిన పలువురు భయభ్రాంతులకు గురై స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.