calender_icon.png 24 October, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందించాలి

24-10-2025 05:04:18 PM

మందమర్రి,(విజయక్రాంతి): బ్యాంక్ ఖాతాదారులకు మరింత చేరువగా నాణ్యమైన సేవలు అందించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. శుక్రవారం మండలం లోని గద్దెరాగడిలో ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ నూతన కార్యాలయాన్ని సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ రీజినల్ హెడ్ (ఎజిఎం.) రాధాకృష్ణ, లీడ్ డిస్టిక్ మేనేజర్ తిరుపతి, శాఖ మేనేజర్ సంజీవ్ తలకోటిలతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ... యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గద్దెరాగడి శాఖ కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా ప్రజలకు, బ్యాంకు వినియోగ దారులకు బ్యాంకు సేవలు మరింత అందుబాటులోకి రానున్నారు. పొదుపు, బీమా, పెన్షన్, పెట్టుబడులు, అనేక అంశాలలో ప్రజలకు సేవలు అందించడం జరుగు తుందని, ప్రజలకు ఆర్థిక అక్షరాస్యతపై బ్యాంక్ అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. శాఖ కార్యాలయం అభివృద్ధికి బ్యాంక్ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తద్వారా జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు.