11 April, 2026 | 3:54 PM

Breaking News

కొండమల్లేపల్లిలో డాక్టర్స్ అకాడమీని మూసివేయాలి   •   బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే   •   ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!   •   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •  

అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నాం

24-10-2025 05:09 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా శుక్రవారం 57 వ మరియు 59వ  డివిజన్ లలో సుమారు రూ.4 కోట్ల వ్యయంతో అంతర్గత రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైనేజీ నిర్మాణం, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రతి డివిజన్ లో  అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రానున్న  రోజుల్లో అన్ని డివిజన్లలో  పర్యటన చేసి ప్రతి కాలనీలో ప్రజల సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని అన్నారు.