03-06-2025 12:00:00 AM
- ఆపరేషన్ సిందూర్ తర్వాత మొదటి సారి భేటీ
న్యూఢిల్లీ, జూన్ 2: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం మంత్రి మండలి సమావేశం కానుంది. ఆపరేషన్ సిందూర్ దాడుల అనంతరం మంత్రిమండలి సమావేశమవడం ఇదే తొలిసారి. ఆ రోజు సాయంత్రం 4.30కి సమావేశం ఉంటుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
ఆపరేషన్ సిందూర్పై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవలే సీడీఎస్ మాట్లాడుతూ.. యుద్ధంలో భారత్ కొన్ని ఫైటర్ జెట్లను కోల్పోయిందని, ఆరంభంలో భారత్ తప్పులు చేసినప్పటికీ ఆ తర్వాత ఆ తప్పులను సరిదిద్దుకుని పాక్పై భీకర దాడులు చేసిందన్నారు. సీడీఎస్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఇప్పటికే కేంద్రాన్ని టార్గెట్ చేశాయి. దేశాన్ని బీజేపీ ప్రభుత్వం తప్పుదోవపట్టిస్తోందని ఖర్గే ఆరోపించారు.