calender_icon.png 3 August, 2025 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు అండగా ఉంటాం..: కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి

02-08-2025 11:24:37 PM

యాచారంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి

యాచారం: రైతులకు అండగా ఉంటామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో రైతు వేదికలో ఏర్పాటు చేసిన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి  కార్యక్రమాన్ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి  రంగారెడ్డితో కలిసి, డిజిటల్ తెరపై తిలకించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.... పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత ద్వారా రూ. 20,500 కోట్లతో రూ.9.70 కోట్ల మంది అన్నదాతలకు నేరుగా వారి ఖాతాలకు బదిలీ అవుతున్నాయన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని మంత్రి అయ్యాక ధాన్యం మద్దతు ధర రూ.13 వందల నుండి రూ.2380 క్వింటాల్ ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం కొంటుంది.

తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాకముందు ప్రతి సంవత్సరం 2300 కోట్లతో ధాన్యం కొనుగోలు చేసేవారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక రూ.26 వేల కోట్లతో ధాన్యం మీద ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అగ్ర పదంలో ప్రయాణిస్తుందని తెలిపారు. ప్రపంచంలో భారతదేశం త్వరలోనే నాలుగో స్థానం నుండి మొదటి స్థానానికి వస్తుందని అన్నారు. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వము అనేక విధాలుగా సహాయ సహకారం అందిస్తుందని తెలిపారు. దేశ రక్షణ రంగంలో భారత దేశము  ఎంతో ప్రగతి సాధించిందని, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతాదని, అందులో ఎవరికి ఎలాంటి అనుమానం లేదని పేర్కొన్నారు.