02-08-2025 11:28:23 PM
మునిపల్లి,(విజయ్క్రాంతి): గోవా నుండి వచ్చే వాహనాలను మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద శనివారం ఎక్సైజ్, ఇన్ఫోసిమెంట్ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టి వివిధ బ్రాండ్ లకి సంబంధించిన 5.250 లిటర్స్ సుంకం చెల్లించని మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు స్వాధీనం చేసుకున్న గోవా మధ్యాహ్నం సంగారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ కు తరలించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ దాడులలో టీంసీఐ శంకర్, ఎస్సైలు హనుమంతు, అనుదీప్, దిలీప్, సిబ్బంది ఈసి అంజి రెడ్డి, అరుణజ్యోతి తదితరులు ఉన్నారు.