6 May, 2026 | 11:39 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

రష్యాపై కఠిన ఆంక్షలకు సిద్ధం

08-03-2025 09:15 AM

 ఉక్రెయిన్‌తో శాంతిఒప్పందమే లక్ష్యంగా ప్రయత్నాలు

వాషింగ్టన్: ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకునే వరకు రష్యా మీద కఠినమైన ఆంక్షలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ప్రకటించారు. యుద్ధం వల్ల విపరీతమైన సమస్యలు వస్తాయని అందుకోసమే శాంతిఒప్పందం కుదుర్చుకోవాలని ఆయన అన్నారు. ఉక్రెయిన్ దేశం తాము ఫ్రెంచ్‌లో తయారైన మిరేజ్ జెట్స్ వాడతామని ప్రకటించిన తర్వాత ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యానించడం గమనార్హం. కనీసం నలుగురు చిన్నారులతో కలిపి 18 మంది ప్రజలు తాజా దాడుల్లో గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. తూర్పు ఉక్రెయిన్‌లో ఈ దాడులు చోటు చేసుకున్నాయి. అమెరికా ఉక్రెయిన్‌కు యుద్ధ సహాయాన్ని నిలిపివేసిన వెంటనే ఈ దాడులు చోటు చేసుకున్నాయి. తమ దేశంలో ఉన్న వయోజనులందరికీ యుద్ధంలో శిక్షణ ఇవ్వనున్నట్లు పోలాండ్ ప్రధాని డోనాల్డ్ టస్క్ ప్రకటించారు.