24-06-2025 05:13:30 PM
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్..
ములుగు (విజయక్రాంతి): జిల్లా ప్రజలు ప్రత్యేక బస్సు టూర్ ప్యాకేజీని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.(District Collector Divakara T.S) అన్నారు. మంగళవారం తన ఛాంబర్ లో ప్రత్యేక టూర్ ప్యాకేజీ పోస్టర్, ప్రచార కరపత్రాలను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రూట్-1లో రామప్ప-భోగతా జలపాతం-మల్లూరు ఎక్స్ ప్రెస్ బస్సు ద్వారా సందర్శనకు ఒక్కొక్కరికి 530/- ఒక్కరోజుకు అదేవిధంగా రూట్- 2 ద్వారా పంచారామాలు ప్రసిద్ధ 5 శివాక్షేత్రలైన అమరావతి, బీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట సందర్శనకు ఒక్కొక్కరికి 2300/-రెండు రోజులు భక్తులు ఇట్టి సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, హనుమకొండ బస్సు స్టాండ్ నుండి ఈ నెల 27న పంచారామాలు యాత్ర బస్సు బయలుదేరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్-2 డిపో మేనేజర్ జ్యోత్స్న, కలెక్టరేట్ పరిపాలనా అధికారి రాజ్ కుమార్, జిల్లా అధికారి, తదితరులు పాల్గొన్నారు.