24-06-2025 05:09:07 PM
రోడ్డు విస్తరణ పనులు షురూ..
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం పట్టణంలో మరో రోడ్డు విస్తరణ పనులకు మోక్షం లభించింది. కేసముద్రం-గూడూరు ఆర్ అండ్ బి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సలహాదారుడు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి(Former MLA Vem Narender Reddy) కృషితో కేసముద్రం పట్టణంలోని ఉప్పరపల్లి చౌరస్తా నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు విస్తరణ పనులను గుత్తేదారు ప్రారంభించారు. ఇప్పటికే అంబేద్కర్ సెంటర్ నుండి కోరుకొండ పల్లి క్రాస్ రోడ్డు వరకు పట్టణ ప్రధాన రహదారి విస్తరణ పనులు చేపట్టగా, తాజాగా మరో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించడం, బైపాస్ రోడ్డును విస్తరించడంతో పట్టణ రోడ్లన్నీ విశాలంగా మారుతున్నాయి.