23-02-2026 04:35:08 PM
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కె. హరితకు వినతిపత్రం సమర్పించారు. జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, కార్మికులకు సంబంధించిన పెండింగ్లో ఉన్న దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పథకాలను వేగంగా అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కార్మికులు దివాకర్, తులసిరామ్, మోహన్, ప్రకాష్ పాల్గొన్నారు.