రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం పొందిన భద్రాద్రి దేవస్థానం వేద పండితులు
20-03-2026 12:00 AM
భద్రాచలం, మార్చి 19, (విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం చెందిన ఉప ప్రధాన అర్చకులు శ్రీమాన్ అమరవాది మురళీకృష్ణమాచార్యులు అలాగే ఋగ్వేద పండితులు కే కామేశ్వరరావు పండితులకు ఉగాదిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఘన సన్మానం నిర్వహించి అవార్డులు అందజేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతి లో జరిగిన ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ,
దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావులు వేద పండితులకు సన్మానం చేశారు. భద్రాచలం దేవస్థానం కి చెందిన వేద పండితులకు హైదరాబాదులో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సన్మానం జరగటం పట్ల భద్రాచలం దేవస్థానం చెందిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు అర్చకులు వేద పండితులు హర్షం వ్యక్తం చేశారు.




