13-06-2025 02:27:32 AM
మహబూబాబాద్, జూన్ 12 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో ప్రతిష్టాత్మకమైన శ్రీ బూనీలా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 15న స్వామి వారి కల్యాణ వేడుకలు, మహా అన్నదానం, శోభాయాత్ర, 16న చక్రస్నానం , పుష్పయాగం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ అధ్యక్షుడు వోలం మురళి, కోశాధికారి కోయగూరి యాకూబు రెడ్డి, అంబటి మహేందర్ రెడ్డి, బానాల నాగరాజు తెలిపారు. బ్రహ్మోత్సవ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.