12-12-2024 01:16:19 AM
హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): ఫోన్ట్యాపింగ్ కేసులో 6వ నిం దితుడైన టీవీ ఛానల్కు చెందిన శ్రవణ్రావు ముందస్తు బెయిలు పిటిషన్ పై బుధవారం హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ శ్రవణ్రావు దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం జస్టిస్ కే సుజన విచారణ చేపట్టి తీర్పు వాయిదా వేశారు.
ఈ పిటిషన్పై గత నెల 28న జస్టిస్ రాధారాణి విచారణ చేపట్టి తీర్పు వాయిదా వేయగా బెంచ్ లు మారడంతో జస్టిస్ కే సుజన మరోసారి విచారణ చేపట్టారు. పబ్లిక్ ప్రాసి క్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి హరీశ్రావు ఆదేశాలతో ఫోన్ట్యాపింగ్ కేసులో ఓ టీవీ ఛానల్కు చెం దిన శ్రవణ్రావు ఎస్ఐబీ అధికారులతో కలిసి కుట్రలో భాగస్వామి అయ్యారన్నారు.
కుట్రలో కీలక పాత్ర పోషించిన శ్రవణ్రావును కస్టడీలో విచారించాల్సి న అవసరం ఉందని తెలిపారు. ప్రైవే టు వ్యక్తుల ఫోన్ నంబర్లు ప్రణీత్రావుకు ఇచ్చి ఫోన్ట్యాపింగ్ చేయించేవా రని చెప్పారు. డబ్బు తరలింపులు జరుగుతున్న సమాచారాన్ని ఫోన్ట్యాపింగ్ ద్వారా తెలుసుకునేవారని పేర్కొన్నారు.
ప్రణీత్రావును అరెస్ట్ చేసిన వెంటనే శ్రవణ్రావు పరారయ్యారయ్యారని తెలిపారు. అతన్ని కస్టడీకి తీసుకుని విచారిం చాల్సిన అవసరంఉందని, అందువల్ల ముందస్తు బెయిలు మంజూరు చేయరాదని కోరారు. ఈ వాదనలతో పిటిష నర్ తరఫు సీనియర్ న్యాయవాది వ్యతిరేకించారు. ఈ కుట్రతో పిటిషనర్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
ఒక జర్నలిస్టుగా రాజకీయాలను విశ్లేషిస్తుంటారని చెప్పారు. కేసు నుంచి పారి పోయారనడంలో వాస్తవం లేదని, ఆ యన అమెరికాలో నివాసం ఉంటున్నారని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేయడానికి ఆయన క్రిమినల్ కాదన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పు వాయిదా వేశారు.