02-07-2025 12:04:28 AM
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ తరఫున 25 వేల రూపాయల తక్షణ సాయం
హనుమకొండ జులై 1 (విజయ క్రాంతి): గుండెపోటుతో మృతిచెందిన సీనియర్ వీడియో జర్నలిస్టు హరిణి రామ ప్రసాద్ మృతదేహానికి మంగళవారం ఉదయం ఎంజీఎం ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కు తరలించారు. క్లబ్ లో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారం సదయ్యలు రామ్ ప్రసాద్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వారి కుటుంబానికి అండగా ఉంటామని కుటుంబసభ్యులను ఓదార్చారు. రామ్ ప్రసాద్ కు నివాళులు అర్పించిన వారిలో టి యు డబ్ల్యూ జే( ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాడిపల్లి మధు, టీయూడబ్ల్యూజే -హెచ్ (143) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్, పిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్, సీనియర్ జర్నలిస్టులు సీహెచ్ సుధాకర్, మెండు రవీందర్, వేముల రాజేశ్వర్ రావు, పొగాకుల అశోక్, బూరం ప్రశాంత్, దొంతు నవీన్, తిరుపతి, రాజు,
వేణు,కిషోర్, వీడియో జర్నలిస్టులు తిరుమల్, రామ్ చందర్, సుధీర్, రామరాజు,ప్రదీప్, వాజీద్, రాజు, వంశీ, సుధాకర్, రాజ్ కుమార్, క్లబ్ కోశాధికారి బొల్ల అమర్, ఉపాధ్యక్షుడు బొడిగె శ్రీను, ఈసీ మెంబర్లు ఎండీ నయీంపాషా, అంజనేయులు, దిలీప్ తదితరులు రామ్ ప్రసాద్ అమర్ రహే అని నినాదాలు చేసి 2 నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మశాంతికోసం ప్రార్థించారు.