07-01-2026 09:33:08 PM
నిజం నిజం నిర్భయంగా రాసే దినపత్రిక విజయక్రాంతి
ఏఎంసీ మాజీ డైరెక్టర్ ముస్తఫా.. డిఎస్పి నర్సింగ్ యాదయ్య
శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ స్కూల్ డైరెక్టర్ మణిమాల
తాండూరు,(విజయక్రాంతి): నిజం నిర్భయంగా వార్తలు రాసే దినపత్రిక విజయక్రాంతి అని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముస్తఫా, తాండూరు డిఎస్పి నర్సింగ్ యాదవ్, శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ పాఠశాల డైరెక్టర్ మణిమాల అన్నారు.
బుధవారం వారు తాండూర్ నియోజకవర్గం విజయక్రాంతి దినపత్రిక ప్రతినిధి అశోక్ కుమార్ గోగికార్ తో కలిసి వేర్వేరుగా 2026 సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దినపత్రిక అనతి కాలంలోనే నిజాలను బయటకి తీసి అన్ని వర్గాల ప్రజా మన్ననలను పొందిందని....ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు రామ్ చందర్ ,రాజు తదితరులు పాల్గొన్నారు.