27-09-2025 09:34:34 AM
తాండూరు,(విజయక్రాంతి): గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఇంకా పొంగిపొర్లతోనే ఉన్నాయి. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి వాడుక వర్షపు నీటితో పొంగి పొర్లుతుంది. దీంతో తాండూర్ వైపు నుండి జహీరాబాద్ కర్ణాటక రాష్ట్రం కుంచారం, బీదర్ కు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు వాడుక వద్ద గంటల తరబడి వేచి చూస్తున్నారు.