31-05-2025 12:00:00 AM
ఎమ్మెల్యేలు వినోద్, వివేక్, వెడ్మ బొజ్జు పటేల్ పిలుపు
బెల్లంపల్లి అర్బన్, మే 30 (విజయక్రాం తి): 30 ఏళ్లలో తొలిసారిగా దేవాపూర్ సిమెంట్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్న పి.విక్రంరావును గెలిపించాలని బెల్లంపల్లి, చెన్నూరు, ఖానాపూర్ ఎమ్మెల్యే లు వినోద్, వివేక్, బొజ్జుపటేల్ కోరారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో బరిలో ఉన్న ఐ ఎన్టీయూసీ అభ్యర్థి విక్రంరావుతో కలిసి శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశంలో వారు మాట్లాడా రు.
ఆదివాసీ సంఘాలు బలపరుస్తున్న వి క్రంరావును గెలిపించాలన్నారు. దేవపూర్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో విక్రమ్ రావును గెలిపిస్తే కార్మికుల హక్కులను కాపాడుతామన్నారు.
ఆ దివాసీలు ఐక్యంగా నిలబడి ఓరి యంట్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐ ఎన్ టీసీయూ అభ్యర్థి పుస్కూరి విక్రంరావును భారీ మెజార్టీతో గెలిపించాలని బుజ్జి పటేల్ ఆదివాసీ సంఘాలకు పిలుపునిచ్చారు. ఆదివాసి సంఘాలన్నీ ఒకతాటిపై నిలబడి ఎన్ని కల్లో విజయకేతనంలో కీలక భూమిక వహించాలని పిలుపునిచ్చారు.
కార్మికులకు సేవ చేస్తా..
దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిపిస్తే కార్మికుల సేవకు అంకితమై పని చేస్తానని ఐఎన్టీయూసీ అభ్యర్థి విక్రమ్రావు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మునిమంద రమేష్, దావ రమేష్, శ్రీనివాస్, రత్నం ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.