గంగమ్మకు హారతి పట్టిన గ్రామస్తులు
01-09-2025 | 12:01am
చేగుంట, ఆగస్టు 31 :చేగుంట మండల పరిధిలోని చందాయిపేట్ గ్రామంలోని దేవుని చెరువు నిండి అలుగు పారడంతో ఆనవాయితీ ప్రకారం గ్రామంలో ఉన్న మల్క దేవుడి వద్ద పూజలు నిర్వహించి అనంతరం అక్కడి నుండి డప్పు చప్పులతో, గుర్రంతో దేవుని చెరువులోకి ఎదుర్కొన్నారు. మత్తడి, తూము వద్ద గంగమ్మకు పూజలు నిర్వహించి హారతి ఇవ్వడం జరిగింది. ఈ కా ర్యక్రమంలో గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.






