16-02-2026 11:55:11 AM
ప్రమాణస్వీకారం చేయించిన అధికారులు
చైర్మన్ ఎవరనేది ఉత్కంట భరితం
ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 16(విజయ క్రాంతి): ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయానికి కౌన్సిలర్లు చేరుకున్నారు. వారితో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు.మూడు రోజుల పాటు క్యాంపునకు వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థులు, ఎమ్మెల్యే మదన్మోహన్తో కలిసి సోమవారం 11 గంటల కు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అభ్యర్థులు నేరుగా కార్యాలయంలోని సమావేశం హాల్లోకి వెళ్లి కుర్చీలపై కూర్చున్నారు. ఎల్లారెడ్డిలో వివిధ పార్టీల నుంచి గెలిచిన కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అధికారులు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.
గంట సమయం గడిస్తే చైర్మన్ ఎవరనేది తేలనుంది.
మరికాసేపట్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్థుల ఎన్నిక నిర్వహించనున్నారు. ఛైర్మన్ అవకాశాలు పద్మ శ్రీకాంత్కు ఉన్నట్లు సమాచారం. ఆదివారం రాత్రి ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మరి కాసేపట్లో అధికారికంగా ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. కాగా.. పద్మ శ్రీకాంత్ గతంలో సైతం మున్సిపల్ ఛైర్మన్గా పని చేశారు. తొలి ఛైర్మన్ కుడుముల సత్యనారాయణపై అవిశ్వాసం నెగ్గడంతో.. పద్మ శ్రీకాంత్ ఛైర్మన్ అయిన విషయం తెలిసిందే. మరోసారి ఆయనకు అవకాశం వస్తుందో లేదో కాసేపట్లో తేలనుంది.