7 March, 2026 | 5:01 PM

పంటలు ఎండుతున్నాయి

06-03-2026 07:50 PM

సాగు నీటిని వెంటనే విడుదల చేయాలి

సిద్ధిపేట ముస్తాబాద్ రోడ్డుపై రైతుల రాస్తారోకో

సిద్దిపేట రూరల్: రంగనాయకసాగర్ కెనాల్ నుండి వెంటనే నీటిని విడుదల చేసి తమ పంటలను కాపాడాలని బంజేరుపల్లి, కోదండరావుపల్లి, మాచాపూర్ గ్రామాల రైతులు అన్నారు శుక్రవారం మాచాపూర్, కోదండరావుపల్లి గ్రామాల సరిహద్దు వద్ద ముస్తాబాద్ రోడ్డుపై తమకు వెంటనే సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా, పోలీసులు జోక్యం చేసుకుని రైతులను సముదాయించి అక్కడి నుండి పంపించి వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగునీటిని విడుదల చేయాలని ఎన్నిసార్లు కోరిన అధికారులు పట్టించుకోకపోవడం లేదని అన్నారు.