23 March, 2026 | 11:23 PM

జీతాల కోసం కుటుంబంతో వాటర్ మెన్ ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి

23-03-2026 09:53 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని గోసాయిపల్లి గ్రామ వాటర్ మెన్ బాలయ్య సోమవారం తన కుటుంబంతో కలిసి ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. గ్రామ వాటర్ మెన్ బాలయ్యకు గత నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదని, దానికి కారణం సర్పంచ్ రాజకీయ వివక్ష చూపుతూ తమను పస్తులుంచుతున్నారని, వెంటనే వేతనం చెల్లించకపోతే కుటుంబంతో సహా కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎంపీఓ శారద దేవి, బ్రహ్మయ్య, బాధితుడు బాలయ్యకు త్వరలోనే వేతనం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.