కేసులకు భయపడం.. ప్రజల పక్షాన నిలబడుతాం
రెండు రోజుల్లో రైల్వే అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభించకపోతే మేమే గుంతను పూడ్చేస్తాం
మాజీ మంత్రి రామన్న
ఆదిలాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): తమపై ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదని ప్రజల పక్షాన నిలబడతామని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి తాంసి బస్టాండ్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి పనుల కోసం గుంతను తవ్వి వదిలేయడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
రెండు రోజుల్లో పనులను పున:ప్రారంభించాలని, లేకపోతే ప్రజల రాకపోకలకు సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తామే ట్రాక్టర్లలో మట్టిని తీసుకువచ్చి గుంత ను పూడ్చి ప్రజల రాకపోకల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిచిపోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందిపడటంతో బీఆర్ఎస్ తరఫున సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి తవ్విన గుంత ప్రాంతాన్ని పరిశీలించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్షిషాను కలిసి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు రామన్న మాట్లాడుతూ... భూ సేకరణ చట్టాన్ని అతిక్రమిస్తూ ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రజలను పక్కదో పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఫిబ్రవరి 13న ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి కేవలం ఎలక్షన్ల కోసమే రైల్వే అండర్ బ్రిడ్జి అంటూ గుంతలు తోడే రాజకీయం చేశారని ఆరోపించారు. తక్ష ణం కలెక్టర్ చొరవ తీసుకొని గుంతలను పూ డ్చి రాకపోకలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు యా సం నర్సింగ్ రావు, ఇజ్జగిరి నారాయణ, మెట్టు ప్రలాద్, యూనుస్ అక్బాని, సాజిదోద్దీన్, వెనగంటి ప్రకాష్, వెంకటేష్, దమ్మ పాల్, కొండ గణేష్, దాసరి రమేష్ పాల్గొన్నారు,




