calender_icon.png 1 June, 2025 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి కోసం కంకణబద్ధులమై పనిచేస్తున్నాం

31-05-2025 12:24:34 PM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధి చేసేందుకు కోసం కంకణబద్ధులమై పనిచేస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Mahbubnagar MLA Yennam Srinivas Reddy) అన్నారు. శనివారం పట్టణ కేంద్రంలోని కోయిల్ కొండ ఎక్స్ రోడ్ జంక్షన్ వద్ద రూ 65.50 లక్షలతో చేపట్టనున్న నిర్మాణపు పనులకు  మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అభివృద్ధికి అందరూ సాహస సాగరలు అందించాలని సూచించారు.

నిర్లక్ష్యం అని మాటకు తావు లేకుండా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటూ అందరు పెంచేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, హన్వాడ మండల అధ్యక్షులు వి.మహేందర్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి,  నాయకులు గుండా మనోహర్, లక్ష్మణ్ నాయక్, ప్రశాంత్, శ్రీను, ఉమర్, మునీర్, ఫకృ తదితరులు పాల్గొన్నారు.