calender_icon.png 26 September, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రేవ్ కేసుల్లో నింధితులకు కచ్చితంగా శిక్షపడే విధంగా బాధ్యతగా పనిచేయాలి

26-09-2025 12:00:00 AM

అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని సందర్శించిన ఎస్పీ రోహిత్ రాజు 

అశ్వరావుపేట, సెప్టెంబర్ 25, (విజయక్రాంతి):గ్రేవ్ కేసుల్లో నిందితులకు కచ్చితంగా శిక్ష పడే విధంగా పోలీస్ సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని, నేను సైతం కార్యక్రమం ద్వారా ప్రజలను భాగస్వామ్యలు చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ రోహిత్ రాజు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయా న్ని సందర్శించారు.

ముందుగా కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కోడిపందాలు,పేకాట,బెట్టింగులు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, పట్టుబడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

అంతర్రాష్ట్ర దొంగల ముఠాల కదలికలపై నిఘా పెంచి దొంగతనాల కట్టడికి కృషి చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ ప్రమాద నివారణ చర్యలను చేపట్టాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించేలా అవగాహనా కా ర్యక్రమాలను చేపట్టాలని సూచించారు.

సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లా ప్రజలను ఎప్పటి కప్పుడు అప్రమత్తం చేస్తూ విస్తృతస్థాయిలో ప్రచారం చేయాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు పోలీస్ స్టేషన్ కాబట్టి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పాడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పారు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట సీఐ నాగరాజురెడ్డి,ఎస్త్స్రలు యాయాతి రాజు,అఖిల,దమ్మపెట ఎస్త్స్ర సాయి కిషోర్ రెడ్డి పాల్గొన్నారు.