29 July, 2026 | 9:12 PM

Breaking News

రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   నెమ్లి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు   •   నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో రెయిన్ జాకెట్స్ పంపిణీ   •   రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వృద్ధురాలి మృతి   •   భూ సర్వే పారదర్శకంగా నిర్వహిస్తాం   •   జిల్లాలో సర్ ప్రక్రియ 98 శాతం పూర్తి   •   వేద వ్యాసునీ జయంతి ఉత్సవాలు   •   బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ శిరోమణి శ్రీ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకలు   •   చిట్యాలలో సర్ -2026పై రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశం   •  

ఆర్టీసీ ప్రయాణికులకు దసరా బహుమతులు

25-09-2025 11:39 PM

- హయత్ నగర్ డిపో మేనేజర్ విజయ్ 

- ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని పిలుపు 

ఎల్బీనగర్:  దసరా పండుగ సందర్బంగా ప్రయాణికులకు ఆర్టీసీ సంస్థ బహుమతులు అందజేస్తుందని హయత్ నగర్ డిపో - 1 మేనేజర్ విజయ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసిన ప్రయాణికులకు 'లక్కీ డ్రా' కార్యక్రమం ద్వారా బహుమతులు అందజేస్తున్నట్లు చెప్పారు.‌ ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసే ప్రయాణికులు తమ టికెట్ పై పేరు, ఫోన్ నెంబర్ రాసి లక్కీ డీప్ బాక్స్ లో వేయాలని సూచించారు.

అందులో భాగంగా హయత్ నగర్ బస్టాండ్ లో లక్కీ డ్రా బాక్స్ ఏర్పాటు చేశామని వివరించారు. లక్కీ డ్రా లో మొదటి బహుమతి రూ, 25వేలు, రెండో బహుమతి  రూ,15వేలు, మూడో బహుమతి రూ, 10వేల నగదు బహుమతులు ఇస్తామని తెలిపారు. లక్కీ డ్రా అక్టోబర్ 8 న రీజినల్ స్థాయిలో అధికారుల సమక్షంలో డ్రా తీస్తామని వివరించారు.