10-09-2025 01:19:12 AM
ఆర్ఆర్ఆర్ (నార్త్) పనుల ప్రారంభానికి, మన్ననూర్ నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్కు అనుమతులివ్వండి
హైదరాబాద్- మధ్య గ్రీన్ఫీల్డ్ రహదారి మంజూరు చేయండి
జాతీయ రహదారుల శాఖమంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి వినతి
విద్యాభివృద్ధికి సహకరించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞాపన
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు 12 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి వెంటనే అనుమతులు మం జూరు చేయాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
రాష్ర్ట పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాజధానుల మధ్య గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మించాల్సి ఉందన్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. తెలంగాణకు సముద్ర రేవు లేనందున బందర్ పోర్ట్ వరకు సరకు రవాణాకు వీలుగా గ్రీన్ ఫీల్డ్ రహదారి మంజూరు చేయాలని కోరారు.
ఈ గ్రీన్ఫీల్డ్ రహదారిలో 118 కిలోమీటర్లు తెలంగాణలో ఉంటుందని, మిగతా భాగం ఏపీలో ఉంటుందని సీఎం వివరించారు. జాతీయ రహదారుల శాఖమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలోని ఆయన నివాసంలో మంగళవారం రాత్రి మావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ర్టంలోని పలు జాతీయ రహదారుల నిర్మాణం, అనుమతులు, పనుల వేగవంతంపై కేంద్రమంత్రితో చర్చించారు.
హైదరాబాద్ రీజినల్ రింగ్రోడ్కు (నార్త్) 90 శాతం భూ సేకరణ పూర్తయినందున వెంటనే ఫైనాన్షియల్, క్యాబినెట్ అనుమతులిచ్చి పనులు ప్రారంభించాలని కోరారు. ఆర్ఆర్ఆర్ (నార్త్)కు సమాంతరంగా ఆర్ఆర్ఆర్ (సౌత్) పనులు చేపట్టాలని, ఇందుకుగానూ వెంటనే అన్ని అనుమతులు మంజూరు చేయాలని కేంద్రమంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ను ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంతో అనుసంధానించే మన్ననూరు రహదారి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్నందున నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని, ఈ ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే ఏపీలోని కృష్ణపట్నం రేవుతో పాటు మార్కాపురం, కంభం, కనిగిరి, నెల్లూరులకు రాకపోకలు సులువ వుతాయని సీఎం తెలిపారు. రావిర్యాల, -ఆమన్గల్-, మన్ననూర్ నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మించాలని కేంద్రమంత్రి గడ్కరీని సీఎం కోరారు.
హైదరాబాద్, -మంచిర్యాల మధ్య ఉన్న రాజీవ్ రహదారిపై వాహన రద్దీ అధికంగా ఉన్నందున హైదరాబాద్ మధ్య నూతన గ్రీన్ఫీల్డ్ రహదారిని మంజూరు చేయాలని, సీఆర్ఐఎఫ్ కింద రూ.868 కోట్లతో పంపిన రహదారుల పనులను మంజూరు చేయాలని కోరారు. సీఎం రేవంత్రెడ్డి చేసిన విజ్ఞప్తులకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. సీఆర్ఐఎఫ్ పనులకు వారంలోపు అనుమతులు ఇస్తామని కేంద్రమంత్రి తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ- పోర్ట్ గ్రీన్ఫీల్డ్ రహదారికి సంబంధించి తమ శాఖ అధికారులను హైదరాబాద్కు పంపుతానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.
ఈ అంశంపై ఎన్హెచ్, ఎన్హెచ్ఏఐ అధికారులతో ఈ నెల 22వ తేదీన హైదరాబాద్లో సమీక్ష నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి గడ్కరీకి తెలిపారు. అంతకుముందు లోక్సభ స్పీకర్ను కూడా సీఎం రేవంత్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సమావేశంలో ఎంపీలు మల్లు రవి, రేణుకా చౌదరి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాం నాయక్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ శ్రీనివాసరాజు, ఆర్అండ్బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, పీసీసీఎఫ్ డాక్టర్ సీ సువర్ణ, కేంద్ర ప్రాజెక్టులు, పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.
యంగ్ ఇండియా స్కూళ్ల అభివృద్ధికి సహకరించండి
తెలంగాణ విద్యారంగంలో సమూలమార్పులు తీసుకొచ్చేందుకు తమ ప్రభు త్వం చేస్తున్న కృషికి మద్దతు ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో సుమా రు 90 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లోని పిల్లలకు కార్పొరేట్ తరహా విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్రమంత్రికి సీఎం వివరించారు.
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షా లు, వరదల వల్ల సంభవించిన నష్టంపై నివేదికను సీఎం అందజేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ఢిల్లీలోని ఆమె కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. రా ష్ట్రంలోని 105 శాసనసభ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మించనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇప్పటికే నాలుగు పాఠ శాలల నిర్మాణ పనులు మొదలయ్యాయని, మిగతా స్కూళ్లకు సంబంధించి టెండర్లు ముగిశాయని వివరించారు.
ఒక్కో పాఠశాలలో 2,560 మంది విద్యార్థులు ఉంటారని, మొత్తం 2.70 లక్షల మంది విద్యార్థులకు ఈ పాఠశాలల్లో చదువే అవకాశం లభిస్తోందని రేవంత్రెడ్డి వివరించారు. అత్యాధునిక వసతులు, ల్యాబ్లు, స్టేడియాలతో నిర్మించే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.21 వేల కోట్ల వ్యయమవుతుందని చెప్పారు. అలాగే రాష్ర్టంలో జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ఆధునిక ల్యాబ్లు, ఇతర మౌళిక వసతుల కల్పనకు రూ.9 వేల కోట్లు వెచ్చించనున్నట్టు సీఎం వివరించారు.
ఈ నిధుల సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు అనుమతించడంతో పాటు ఎఫ్ఆర్బీఎం పరిమితి నుంచి మినహాయించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ర్ట ప్రభుత్వం విద్యా రంగంపై చేస్తున్న వ్యయాన్ని పెట్టుబడిగా పరిగణించాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు. గత ప్రభుత్వం ఇష్టారీతిగా అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చిందని, వాటి చెల్లింపు రాష్ర్ట ప్రభుత్వానికి భారంగా మారిన నేపథ్యంలో వాటి రీస్ట్రక్చరింగ్కు అనుమతించాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. సీఎం చేసిన విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు.