31-05-2025 07:33:37 PM
జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్..
లక్షెట్టిపేట (విజయక్రాంతి): యువత చెడు వ్యసనాల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్(Junior Civil Judge Sai Kiran) అన్నారు. శనివారం వరల్డ్ యాంటీ టొబాకో డే(World Anti-Tobacco Day) సందర్భంగా కోర్టు ఉద్యోగులతో ప్రమాణం చేయించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... పొగాకు జీవితాలను నాశనం చేస్తుందన్నారు. పొగాకు వ్యసనానికి గురైతే అది క్యాన్సర్ కు దారి తీస్తుందని, తద్వారా ఆర్థికంగా శారీరకంగా నష్టపోతామని ఆయన వివరించారు.
అనంతరం మోదేల గ్రామంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రాజీమార్గమే రాజమార్గమని క్షణికావేశంతో చేసిన తప్పులను సరిదిద్దుకొని కోర్టు కేసుల నుండి విముక్తి పొందాలన్నారు. జూన్ 14న ఏర్పాటు చేయనున్న లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొమిరెడ్డి సత్తన్న, జనరల్ సెక్రటరీ ప్రదీప్ కుమార్, సత్యం, స్థానిక ఎస్ ఐ సురేష్, సీనియర్ న్యాయవాదులు రాజేశ్వరరావు, అక్కల శ్రీధర్, రవీందర్, పద్మ, రెడ్డి మల్ల ప్రకాశం, తదితరులు పాల్గొన్నారు.