08-01-2026 05:21:12 PM
ఎస్సీ మల్చూరు నాయక్
కాటారం,(విజయక్రాంతి): విద్యుత్తు సమస్యలపై ప్రజలు తమ వినతులు సమర్పించేందుకు ఏర్పాటుచేసిన ప్రజా బాట కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ ఎస్ఇ మల్చూర్ నాయక్ కోరారు. గురువారం కాటారం మండలం ప్రతాపగిరిలో విద్యుత్తు ప్రజాపాట నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ ఈ హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామ సర్పంచ్ ఊర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ వరకు నూతనంగా విద్యుత్తు స్తంభాలను ఏర్పాటు చేయాలని కోరారు. వీధులలో వదులుగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేయాలని సూచించారు.