calender_icon.png 28 June, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42 శాతం రిజర్వేషను లేకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఊరుకోం

27-06-2025 02:09:27 AM

రాష్ట్ర గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్

చండూరు, ( గట్టుప్పల)జూన్ 26: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గట్టుప్పల మండల పరిధిలోని తేరటుపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ, కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీకి అనుగుణంగా బీసీ రిజర్వేషన్లు అమ లు చేయకుండా ఎన్నికలు నిర్వహించడ మంటే ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ద్రోహం చేయడమేనని విమర్శించారు.

గురువారం నాడు తెరట్ పల్లిలో పల్లె రవి కుమార్ గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల్లో 42 రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం పొంది మూడునెలలు అవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తో ఒప్పించడానికి చేసిన ప్రయత్నం శూన్యమని మండిపడ్డారు.

మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పటికైనా చౌకబారు రాజకీయాలు చేయ డం మానుకుని, తమిళనాడు తరహాలో రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు రోడ్ మ్యాప్ రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ లకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చని పక్షంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలోబీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు మహ్మద్ యూసుఫ్, చండూరు మండల ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు గొరిగె సత్తయ్య, బీఆర్‌ఎస్ గ్రామ శాఖ పార్టీ అధ్యక్షులు మండల కృష్ణ, పార్టీ నాయకులు చెరుకుపల్లి వెంకటయ్య, పగిళ్ల సైదులు, బీసీ నాయకుడు వీరమల్ల మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.