మదనన్నపై అసత్యపు ఆరోపణలు రాస్తే ఊరుకోం
తాడ్వాయి,మే, 10( విజయక్రాంతి): ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు పై అసత్యపు ఆరోపణలు చేస్తూ వార్తలు రాస్తే ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేస్తున్న కొందరు గిట్టని వ్యక్తులు కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్న ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని ఆరోపించడం సరికాదన్నారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సంజీవులు, మాజీ అధ్యక్షులు వెంకటరెడ్డి నాయకులు మహేందర్ రెడ్డి, షౌకత్ అలీ, మేకల రాజు, రఘుపతిరావు పాల్గొన్నారు.






