calender_icon.png 25 December, 2025 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తాం

25-12-2025 12:11:24 AM

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల, డిసెంబరు 24 (విజయ క్రాంతి): వ్యవసాయ కళాశాల విద్యార్థులు కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగిందని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల నియోజకవర్గంలోనీ పొలస గ్రా మంలో ప్రోపెసర్ జయశంకర్ అగ్రికల్చర్ కళాశాలలో బుధవారం నఇంటరాక్షన్ మీటింగ్ విత్ స్టూడెంట్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ అగ్రికల్చర్ కాలేజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ భారతదేశలో చాలా వరకు వ్యవసాయం పైన ఆధార పడి జీ వనం కొనసాగించడం జరుగుతుందన్నారు.

జానయ్య చాలా విజన్ ఉన్న వీసీ అని, వ్యవసాయ కళాశాలకు సంబంధించిన ప్రతి విషయంలో ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం జరుగుతుందన్నారు. గతంలో వ్యవసాయ కళాశాలలో సరైన ప్రొఫెసర్లు లేరని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి స్పందించి విసిని నియమించి వ్యవసాయ కళాశాల మౌలిక వసతులు కల్పనకు తగు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

ఎస్సీ డిపార్ట్మెంట్ ద్వారా 7 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని మరిన్ని నిధులు కావాలనీ కోరడం జరిగిందని అట్టి నిధులను తప్పకుండా విడుదల చేస్తామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తులో విషయంలో ఎలాంటి అవసరం ఉన్న తప్పకుండా తమ సహకారం ఉంటుందని, హెడ్యూల్ క్యాస్ట్ విద్యార్థుల విషయంలో వారి భవిష్యత్తు విషయంలో ఎటువంటి అవసరం ఉన్న నా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, వీసీ జానయ్య పాల్గొన్నారు.