13-06-2025 01:32:59 AM
ఎల్బీనగర్, జూన్ 12 : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్ర తీ కాలనీలో సమస్యలను పరిష్కరిస్తామని జీహెచ్ఎంసీ జో నల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ హామీ ఇచ్చారు.ఈ రోజు బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోగ గురువారం జో నల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, కా ర్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, అధికారులు పలు కాలనీల్లో పర్యటించి, స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
ఎన్జీవోస్ కాలనీ, సచివాలయ నగర్ లో జరుగుతున్న ఉమెన్స్ థీమ్ పార్క్ పనులు వేగవంతం చేయాలని, పార్కులో ఓపెన్ జిమ్ పరికరాలు, పిల్లల ఆట పరికరాలు, ప్రహరీ ఫెన్సింగ్ మరమ్మతులు, ఓపెన్ నాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కార్పొరేటర్ లచ్చిరెడ్డి కోరారు. రానున్న వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని ఓపెన్నాలాలో పూడికలను తీయాలని సూచించారు.
సాహెబ్ నగర్ స్మశాన వాటిక అభివృద్ధి చేయాలని, వీధి దీపాలు, రోడ్లు,నూతన రంగులు, మొక్కలు నాటించాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. శ్రీపురం కాలనీ నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు నూతన రోడ్డు నిర్మించాలని, శివారు కాలనీల్లో రోడ్లు, వీధి దీపాలు, పార్కు స్థలాలకు ప్రహరీ నిర్మించాలని కోరారు. కాలనీల్లో ఓపెన్ జిమ్ లు, సంక్షేమ సంఘం భవనాలు, నూతన రోడ్ల నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని కార్పొరేటర్ లచ్చిరెడ్డి కోరారు.
ఆయా కాలనీల్లో జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ... అతి త్వరలోనే కాలనీలోని ప్రతి సమస్య పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామ న్నారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ విభాగం ఈఈ రమేశ్ బాబు, డీఈ దామోదర్ రావు, శానిటేషన్ డీఈ నీలిమ, ఎలక్ట్రిక్ సిటీ డీఈ పున్నా నాయక్, ఎంటమాలజీ ఏఈ రవీందర్ రెడ్డి, ఇంజినీరింగ్ విభాగం ఏఈ రాజ్ కుమార్, జిహెచ్ఎంసి అధికారులు, బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, మహేశ్ గౌడ్, శివశంకర్ గౌడ్, చందు, పవన్ కుమార్, సురేష్ కుమార్ తదితరులుఉన్నారు.