calender_icon.png 13 June, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

13-06-2025 01:35:04 AM

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి 

తుర్కయంజాల్, జూన్ 12: ప్రవేట్ పాఠశాలకు దీటుగా ప్ర భుత్వ పాఠశాలలు అభివృద్ధి చే సి.. అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. గురువా రం ఇంజాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు, బ ట్టలు బుక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత భారాస ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా అదనపు గదులు, ప్రహారి నిర్మాణం, మరుగు దొడ్లు, తాగు నీటి సౌకర్యంతోపాటు మరమ్మతులు చేయలేకపోయిందని ప్రభుత్వ పాఠశాలలు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు.

టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేట్ పాఠశాలకే ప్రాధా న్యత కల్పించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేస్తామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు కూడ తమ పిల్లను ప్రైవేటు పాఠశాలలకు పంపవద్దని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మిడియంలో విద్యాబోధన కొనసాగుతుందని అన్నారు.

విశాలమై న తరగతి గదులలో ప్రశాంత వాతవరణంలో విద్యాబోధన ప్రత్యేక తరగతులతో పాటు వ్యక్తిగత శ్రద్ద, ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలు రెండు జతల యూనిఫాం ఉచిత మధ్యాహ్న భోజనం మనోవికాసాభివృద్ధికి సాంస్కృతిక కార్యక్రమాలు ఆటలు సౌకర్యం పుస్తకాలు ఇలా ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనతో పేద విద్యార్థులకు విద్యను అందించేందుకు కృషి చేస్తుందని అన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలకే పంపాలని  కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండ్లపల్లి ధనరాజ్ గౌడ్ , గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మస్తీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి, నాయకులు బొక్క వంశీధర్ రెడ్డి, మహమ్మద్ గౌస్ పాషా, స్కూల్ ఉపాధ్యాయులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.