calender_icon.png 1 June, 2025 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతాం

30-05-2025 01:14:53 AM

రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇల్లు మంజూరులో

ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలతో, కలెక్టర్లతో మంత్రి జూపల్లి ప్రత్యేక సమావేశం ఇబ్బందులు మంత్రికి వివరించిన ఎమ్మెల్యే 

ఎల్లారెడ్డి, మే 29 (విజయక్రాంతి): ఉమ్మడి నిజాంబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్లతో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు నిజాంబాద్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం గురువారం సాయంత్రం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో ఉమ్మడి జిల్లాల శాసనసభ్యులతో జిల్లా కలెక్టర్లతో పలు సమస్యలపై చర్చించారు.

అనంతరం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందుల గురించి మంత్రికి విన్నవించారు. అలాగే రాజీవ్ యువ వికాసం పథకం సంబంధించిన గ్రామీణ సమస్యల పట్ల మంత్రికి తెలిపారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతులు పండించిన ధాన్యం తరలించడంలో జాప్యంపై మంత్రితో చర్చించారు. ఎమ్మెల్యే మదన్మోహన్ సమస్య విన్న జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమస్య తలెత్తకుండా సామరస్యంగా జరిగే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కామారెడ్డి జిల్లా కలెక్టర్, ఆశీస్ సంగ్వాన్, ఉమ్మడి జిల్లాల నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.