calender_icon.png 20 January, 2026 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదర్శ మున్సిపాలిటీగా భూపాలపల్లిని తీర్చిదిద్దుతాం

20-01-2026 12:10:40 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జనవరి 19 (విజయక్రాంతి): భూ పాలపల్లి మున్సిపాలిటీని ఆదర్శవంతం గా తీర్చిదిద్దామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీలోని 5, 6, 7, 26వ వార్డుల్లో 3 కోట్ల రూపాయలతో ని ర్మించనున్న అటవీ రక్షణ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మహిళా సం ఘాలకు కోటి రూపాయలు బ్యాంకు లింకే జీ, 20 లక్షలు వడ్డీ లేని రుణాలు, పురపాలక పరిధిలోని మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అడ వి జంతువులు నివాసాల్లోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, ప్రజల రక్షణ కోసం 3 కోట్ల రూపాయల వ్యయంతో పటిష్టమైన రక్షణ గోడ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి మ హిళలు పట్ల అపారమైన గౌరవం ఉందని, తాము అధికారం చేపట్టిన 24 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. సంక్రాంతి సారెగా ఇందిర మ్మ చీరలు పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. పురపాలక సంఘ పరిధిలోని 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరెలు ఇస్తామన్నారు.

మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం వడ్డీలేని రుణాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మహిళల ఆర్థికంగా ఎదిగేందుకు రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి నియోజ కవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మం జూరు చేసినట్లు తెలిపారు. అర్హత కలిగిన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు లు, ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో మహిళలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు, ఆర్టిసి బస్సులు, పెంట్రోల్ బంకు లు ఇస్తున్నామని తెలిపారు.

నిధులు, నీళ్లు, నియమాలు కోసం ఏర్పడిన తెలంగాణలో గత 10 సంవత్సరాలు వెనుకబాటుకు గురైందని, ఉద్యోగాలు రాలేదని ఆయన తెలిపా రు. తమ ప్రభుత్వం అధికారం చేయకట్టగానే గ్రూప్ 1,2 3 ఉద్యోగాలతో శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తీకి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మంచి చేస్తున్న ప్రభు త్వానికి ఎప్పుడు ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు, పేరు మార్పిడి సొంతింటికలను సాకారం చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే సత్యనారాయణ రావు మాట్లాడుతూ వెజిటబుల్ మార్కెట్, బంజారా భవన్, అంబేద్కర్ భవన్, మున్సిపాలిటీలో సిసి రోడ్లు, ము రుగు కాలువలు తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. 

అన్ని కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్స్ నిర్మించనున్నట్లు తెలిపారు. 500 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్డు నిర్మాణం, 664 కోట్ల రూపాయలతో భూపాలపల్లి నుండి గూడెప్పాడు వరకు నాలుగు వరుసల రహదారి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పీ సంకీర్త్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, మెప్మా పీడీ రాజేశ్వరి, ఎంపీడిఓ తరుణ్ ప్రసాద్, మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.