12 July, 2026 | 3:39 AM

కొండగట్టు అభివృద్ధికి కృషిచేస్తా

10-06-2024 01:41 AM

ప్రభుత విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్

జగిత్యాల, జూన్ 9 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయసామి ఆలయ అభివృద్ధికి కృషిచేస్తానని ప్రభుత విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. ఆదివారం కొండగట్టు అంజన్నను దరించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్న దరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలి పారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, మండల కాం గ్రెస్ అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.