calender_icon.png 14 June, 2025 | 3:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన విద్యా సంవత్సరానికి మామిడి తోరణాలతో స్వాగతం

12-06-2025 10:41:06 PM

పెన్ పహాడ్ : మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలలో నూతన విద్యా సంవత్సరం స్వాగత ప్రారంభంలో భాగంగా అన్ని పాఠశాలలకు మామిడి తోరణాలతో అందంగా అలంకరించి పండుగ వాతావరణంలో విద్యార్థులను, ఉపాధ్యాయులను గ్రామస్తులు పాఠశాల ఎస్ఎంసి కమిటీ స్వాగతం పలికారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని గ్రామస్తులు,  విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం ఉచితంగా అందజేసిన పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, దుస్తులను మండల విద్యాధికారి నకిరేకంటి రవి, ఏఏపీసి చైర్మన్ అలీమా బేగం మల్సూర్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఇంతకుముందు బడి గంట మోగించి విద్యార్థులను సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ధర్మారెడ్డి దంతాల వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు