అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి
రంగారెడ్డి, జూన్ 27 (విజయక్రాంతి): సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా బ్యాంకు అధికారులు తమ లక్ష్యాలను చేరుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో బ్యాంకర్లతో కలిసి డీసీసీ, డీఎల్ఆర్సీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వార్షిక రుణ ప్రణాళికలను కలెక్టర్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా క్రెడిట్ ప్లాన్ని 2024 ఏడాదికి సంబంధించి రూ.49815.36 కోట్లతో, గతేడాది కంటే రూ.25648.36 కోట్ల పెరుగుదలతో, 28.17 శాతం వృద్ధిని అంచనా వేయడం జరిగిందని చెప్పారు.
బ్యాంకు సేవలను అందించాలనే ఉద్దేశంతో మారుమూల ప్రాంతాలకు బీసీ పాయింట్లను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రతి అకౌంటుకు ఆధార్కార్డు, పాన్కార్డ్ సీడ్ చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. జిల్లాలో అర్హులందరికీ బ్యాంకులు ఏపీవై, ఎస్ఎస్వై ఖాతాలను తెరవాలని ఆదేశించారు. జిల్లాలో ఆర్థిక సహాయ పథకాలను గ్రౌండింగ్ చేసి లక్ష్యాలను సాధించినందుకు బ్యాంకర్లు, సెక్టోరియల్ హెడ్లు, డీఆర్డీఏ, డీఐసీ, సెర్ప్, మెప్మా అధికారులను అభినందించారు.




