వెల్నెస్ సెంటర్లను బలోపేతం చేయాలి
- ఆరోగ్యశాఖ కార్యదర్శికి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి వినతి
- త్వరలోనే ఏర్పాటుచేస్తామని హామీ
హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 వెల్నెస్ సెంటర్లలో మందుల కొరతను పరిష్క రించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టియానా చోంగ్తును గురువారం ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్ రెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. పెన్షనర్లకు షుగర్, బీపీకి సంబంధించిన మందుల కొరత ఉందన్నారు.
దీనిపై క్రిస్టియానా స్పందిస్తూ వెల్నెస్ సెంటర్లను మెడికల్ కాలేజీలకు అనుబంధ ఆస్పత్రులతో అనుసం ధానం చేశామని, అక్కడ వైద్యులు అన్నిరకాల వ్యాధులకు చికిత్సను అందిస్తున్నారని తెలిపారు. నూతన జిల్లాలకు సంబంధించి మరో 22 జిల్లాల్లో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ప్రభు త్వం వద్ద ఉందని, బడ్జెట్ కేటాయింపుల తర్వాత నెల రోజుల్లో అన్ని జిల్లాల్లో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని శ్రీపాల్ రెడ్డి పేర్కొన్నారు.




